భారత్ లో జనాభా రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. దేశం ఆర్ధికంగా బలపడటానికి ఇది ప్రధాన సమస్యగా మారింది. కరోనా వైరస్ తీవ్రత  పెరగడానికి కూడా ఇప్పుడు జనాభానే కారణం అని కేంద్రం కూడా పదే పదే చెప్తూ వస్తుంది. ఇక ఈ తరుణంలో తాజాగా కేంద్ర మంత్రి గిరిరాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. 

 

పెరుగుతున్న జనాభా  మనకు సవాలుగా మారిందని ఆయన అన్నారు. మనం అభివృద్ధి చెందిన దేశాలతో నిలబడాలనుకుంటే, మనం జనాభా నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు. ఈ దేశంలోని ప్రతి ఒక్కరికీ వారు అనుసరించే ఏ మతంతో సంబంధం లేకుండా వర్తించే కఠినమైన చట్టమని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: