ఈ మద్య ప్రధాన మీడియాతో పాటుగా సోషల్ మీడియాలో కాస్త రమణ దీక్షితులు ఎక్కువగా కనపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా టీటీడీ ఉద్యోగుల లక్ష్యంగా వ్యాఖ్యలు చేసారు. టీటీడీ అధికారులపై రమణదీక్షితులు ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ హయాం లో 20 మందికి పైగా వంశ పారపర్య అర్చకులను విధుల నుంచి తొలగించారని ఆయన గుర్తు చేసారు. 

 

కోర్టు ఆదేశించినా విధుల్లోకి తీసుకోలేదని ఆయన ఈ సందర్భంగా మండిపడ్డారు. సీఎం జగన్‌ విధుల్లోకి తీసుకోవాలని చెప్పినా తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు. టీటీడీ అధికారులు ఇప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలనే అమలు చేస్తున్నారని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు. ఇటీవల తిరుమల కేంద్రం ఆధీనంలోకి వెళ్తుందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: