ఈజిప్టులోని అలెగ్జాండ్రియా నగరంలో 11 మంది సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఆరుగురి మృతదేహాలు లభ్యం కాగా... మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.

 

అలెగ్జాండ్రియా సముద్ర తీరం ప్రసిద్ధ పర్యటక ప్రదేశం. కరోనా సంక్షోభం కారణంగా.. ప్రస్తుతం ఈ తీరం మూసివేసి ఉంది. సంరక్షకులూ సెలవులో ఉన్నారు. అయితే పోలీసుల కళ్లు కప్పి ఓ బృందం తీర ప్రాంతానికి చేరుకుంది. అందులో ఓ యువకుడు సరదాగా పరిగెత్తుకుంటూ సముద్రంలోకి వెళ్లి ప్రమాదానికి గురయ్యాడు. అతన్ని రక్షించడానికి మరో వ్యక్తి వెళ్లాడు. వేగంగా వచ్చిన కెరటాలు ఇద్దరినీ లోపలికి ఈడ్చుకెళ్తుండగా మిగిలిన 9 మంది వారిని కాపాడేందుకు ప్రయత్నించి మృత్యువాత పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: