ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మరోమారు విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. పీఎం కేర్స్ నిధికి విరాళాలు అందించిన దాతల పేర్లను మోదీ వెల్లడించకపోవటం ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. ఈ విషయంలో ప్రధాని భయపడుతున్నారా అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
పీఎం కేర్స్ నిధులను సమీక్షించేందుకు పార్లమెంట్ ప్యానల్ను భాజపా ఎంపీలు అడ్డుకున్నారన్న వార్తలను ట్వీట్కు జతచేశారు రాహుల్ గాంధీ.
కొద్ది రోజులుగా పీఎం కేర్స్ నిధులపై ఆడిట్ జరగాలని రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన పార్టీ ఎంపీల సమావేశంలోనూ ఈ అంశాన్ని లేవనెత్తారు రాహుల్. ప్రజల నుంచి డబ్బు అందిన నేపథ్యంలో ఆడిట్, సమీక్ష పరిధిలోకి తప్పనిసరిగా తీసుకురావాలని డిమాండ్ చేశారు.
Why is PM so scared of disclosing the names of those who donated money to him for PMCares?
— rahul gandhi (@RahulGandhi) July 11, 2020
Everyone knows Chinese companies huawei, xiaomi, TikTok and OnePlus gave money.
Why doesn’t he share the details?https://t.co/DLi8SrJ2Jy