బాలీవుడ్ లో ఇప్పుడు కరోనా పెద్ద చిచ్చు రాజేసింది. అమితాబచ్చన్, అతని కుమారుడు కి కరోనా పాజిటివ్ రావడం సోషల్ మీడియాలో అనేక పుకార్లు షికారు చేస్తున్నాయి. బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ సోదరి రిద్దిమా కపూర్ సాహ్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా తమపై జరుగుతున్న అబద్ధపు ప్రచారానికి తెరలేపారు.
సోషల్ మీడియా వేదికగా రణబీర్ కపూర్, నీతూ కపూర్, కరణ్ జోహార్ లకి కరోనా పాజిటివ్ వచ్చిందని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పోస్టులో అమితాబ్ బచ్చన్ మనవడు అగత్స్య నంద, నీతూ పుట్టినరోజు పార్టీకి వచ్చాడని అతడి నుంచి వీరికి సోకిందని అందులో ఉంది. దీనికి ఆగ్రహించిన రణబీర్ కపూర్ సోదరి ఇన్స్టాగ్రామ్ వేదికగా తమ ఆరోగ్య పరిస్థితి బాగుందని. ఎవరు రూమర్స్ నమ్మవద్దని తెలిపారు.
Ranbir Kapoor’s sister Riddhima Kapoor refutes rumours that he, neetu singh have tested Covid-19 positive: ‘We are fit’https://t.co/BI1vjstHAq pic.twitter.com/MDJzmiGb8P
— HT Entertainment (@htshowbiz) July 12, 2020