తెలంగాణాలో దాదాపు నెల రోజుల నుంచి తెరాస వర్సెస్ బిజెపి గా రాజకీయం మారిపోయింది.  తెలంగాణాలో ఇప్పుడు బిజెపి నేతల నుంచి ఏ మాట వచ్చినా సరే తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంది తెరాస. ఇక తాజాగా ఒక అడుగు ముందుకు వేసి దాడులకు దిగారు తెరాస కార్యకర్తలు.

 

హన్మకొండలో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య కొట్లాట జరిగింది. వరంగల్ బీజేపీ అర్బన్ ఆఫీసుపై టీఆర్ఎస్ నేతలు దాడికి  ప్రయత్నం చేయడంతో వాతావరణం వేడెక్కింది. దీనితో టీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు తెరాస నేతలు ఆగ్రహంగా ఉన్నారు. రోజు రోజుకి ఆయన హెచ్చు మీరి మాట్లాడుతున్నారు అంటూ  తెరాస  ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: