హైదరాబాద్ లో పోలీసులు భారీగా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ముంబై తర్వాత ఆ రేంజ్ లో కరోనా బారిన పడిన పోలీసులు హైదరాబాద్ కి చెందిన వారే ఉన్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు పోలీసుల్లో రికవరీ రేటు చాలా బాగా పెరుగుతుంది అని ప్రభుత్వం పేర్కొంది. పోలీసు శాఖ కూడా ఈ విషయంలో చాలా వరకు సంతోషంగానే ఉంది. 

 

తాజాగా 31 మంది పోలీసులు కరోనా నుంచి బయటపడి విధుల్లోకి చేరారు. మహమ్మారి నుంచి కోలుకున్న31 మంది ట్రాఫిక్ పోలీసులను సీపీ అంజనీకుమార్ అభినందించారు. ఈ నేపధ్యంలో ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రొఫెషనల్ పోలీస్ లైఫ్‌లో ఇంత కష్టతరమైన పరిస్థితి రావడం దానిని పోలీస్ సిబ్బంది అధిగమించడం సంతోషమని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: