రెండు రోజుల క్రితం కరోనా  పాజిటివ్ వచ్చిన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ అలాగే అభిషేక్ బచ్చన్ ల ఆరోగ్యంపై నానావతి ఆస్పత్రి స్పందించింది. వారికి ఇప్పుడు దూకుడుగా చికిత్స చెయ్యాల్సిన అవసరం లేదు అని వారి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పింది. వారికి కరోనా అంత తీవ్ర౦గా లేదని స్పష్టం చేసింది. 

 

అభిమానులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని వారు కోలుకుంటున్నారు అని పేర్కొంది. వారితో పాటుగా ఐశ్వర్య రాయ్ కు కూడా కరోనా  వచ్చిన సంగతి తెలిసిందే. వీరు అందరూ ఇప్పుడు నానావతీ ఆస్పత్రిలో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. వారు కోలుకోవాలి అని అభిమానులు ప్రత్యేక పూజలు కూడా చేయడం గమనార్హం. వారు త్వరలోనే డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: