క్వారంటైన్ కేంద్రాల్లో ఉండే లోపాలపై దేశ వ్యాప్తంగా విపక్షాలు రాష్ట్ర ప్రభుత్వాలపై ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని కొన్ని ప్రాంతాల్లో సిబ్బంది నిర్లక్ష్యంపై కూడా విపక్షాలు ప్రభుత్వాలను టార్గెట్ చేస్తున్నాయి. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ లో ఆరోపణలు చేసారు. “తమకేదయినా ఆపద వస్తే ప్రభుత్వం నన్ను ఆదుకుంటుందన్న భరోసా ప్రజలకు ఉండాలి. కానీ రాష్ట్రంలోని కరోనా క్వారంటైన్ కేంద్రాలలోని పరిస్థితులు చూస్తే ప్రజల్లో ఆందోళన, అభద్రతా భావం పెంచేలా ఉన్నాయి. అని ఆయన మండిపడ్డారు. 

 

ఇంత ఖర్చుపెడుతున్నాం, అంత ఖర్చు పెడుతున్నాం అంటూ పాలకులు లెక్కలు చెబుతున్నారు. అలాంటప్పుడు పరిస్థితులు ఎందుకింత దారుణంగా ఉంటున్నాయి?  పేషంట్ల పేరు చెప్పి అవినీతికి పాల్పడుతున్నారా? ప్రజల ప్రాణాలతో చెలగాటం ఏంటి? అక్షయ లాంటి సంస్థలతో కలిసి అన్న క్యాంటీన్ లను ఎంతో ఘనంగా నిర్వహించాం. పనితనం మాటల్లో, ప్రకటనల్లో కాదు చేతల్లో చూపించండి.” అంటూ చంద్రబాబు విమర్శలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: