విశాఖలో జరిగిన భారీ పేలుడు ఇప్పుడు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ భారీ పేలుడు దెబ్బకు అల్లాడిపోయింది విశాఖ.  ఇక ఎప్పుడు ఎం జరుగుతుందో అనే ఆందోళన విశాఖ ప్రజల్లో నెలకొంది. ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం భారీగా సంభవించడంతో ఇప్పుడు అక్కడ ఏ ఆందోళన జరగకుండా ఉండటానికి గానూ పటిష్ట భద్రత ఏర్పాటు చేసారు అధికారులు. 

 

పరవాడ ఫార్మా సిటీ గేట్ దగ్గర భారీగా పోలీసులు మొహరించారు. ఇక ఈ కంపెనీ లో ప్రమాదానికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు. క్రిమినల్ కేసు నమోదు చేసి కఠినం గా వ్యవహరించాలి అని డిమాండ్ చేయడంతో ఏ ఆందోళన లేకుండా ఇప్పుడు పోలీసులు మొహరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: