తెలంగాణాలో కరోనా వైరస్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. కరోనా కట్టడికి ఎంత సమర్ధవంతంగా పని చేస్తున్నా సరే కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణాలో చాలా మంది నాయకులకు కరోనా సోకింది. అయినా సరే వైద్యం సరిగా చేయించుకుని దాని నుంచి బయటపడి ఇప్పుడు మళ్ళీ ప్రజల్లోకి వస్తున్నారు. 

 

ఈ నేపధ్యంలోనే డిప్యూటి స్పీకర్ పద్మారావు గౌడ్ కరోనా నిబంధనలను గాలికి వదిలేసారు. బహిరంగ బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం అనుమతి లేదు. తన నివాసం ముందు జరిగిన బోనాల ఉత్సవాల ఊరేగింపుకి ఆయన హాజరయ్యారు. ఇటీవల ఆయన కరోనా నుంచి కోలుకుని బయట పడ్డారు. కనీసం సారు గారికి మాస్క్ కూడా లేదు. ఇప్పుడు మాస్క్ లేకుండా ఆయన అలా కార్యక్రమంలో పాల్గొనడంపై ఆందోళన వ్యక్తమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: