ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న విషయం తెలిసిందే. రోజు భారీగా కేసులు నమోదు అవుతుండగా... గత 24 గంటల్లో కూడా రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 22670 నమూనాలను పరీక్షించగా 1908 మందికి కరోనా పాజిటివ్ పని నిర్ధారించబడింది. ఒకరోజు వ్యవధిలోనే ఏకంగా 43 మంది మరణించడం సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే గత 24 గంటల్లో 952 మంది కరోనా వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15 వేల 144 మంది చికిత్స పొందుతున్నారు. 17425 మంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇది ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ బారినపడి 408 మంది మరణించారు.