హైదరాబాద్ నగరంలోని గోపన్ పల్లి తండా లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ వివాహిత ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నది . భర్త అత్తమామల వేధింపులే  ఆత్మహత్యకు కారణమని ప్రస్తుతం మృతి చెందిన మహిళ కుటుంబీకులు ఆరోపణలు చేస్తున్నారు. 

 

 స్రవంతికి సంతోష్ కుమార్ తో 2017 లో వివాహం జరుగగా... వారిద్దరికీ ప్రస్తుతం రెండేళ్ల బాబు ఉన్నారు. కొన్ని రోజుల నుంచి వీరిద్దరి మధ్య ఎక్కువగా గొడవలు జరుగుతున్నాయి. నిన్న రాత్రి కూడా భర్త అత్తమామలతో గొడవ జరగడంతో మనస్థాపానికి గురైన స్రవంతి ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు,

మరింత సమాచారం తెలుసుకోండి: