ఇటీవల నేపాల్ ప్రధాని శ్రీరాముడు  జన్మభూమి అయోధ్య పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. శ్రీరాముడు భారతదేశానికి చెందిన వాడు కాదని నేపాల్ కు  చెందిన వాడు అంటూ వ్యాఖ్యానించడం ఎంతో వివాదాస్పదంగా మారిపోయింది. అయితే తాజాగా నేపాల్ ప్రధాని ఓలీ చేసిన వ్యాఖ్యలపై విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర  స్పందించారు

 

 నేపాల్ ప్రధాని వ్యాఖ్యలను స్వరూపానందేంద్ర స్వామి తీవ్రంగా ఖండించారు. శ్రీరాముడు భారత దేశంలో జన్మించాడు అనడానికి ఎన్నో చారిత్రాత్మక సాక్ష్యాలు ఉన్నాయి అంటూ తెలిపిన స్వరూపానందేంద్ర స్వామి... చరిత్రను వక్రీకరించడం సరైనది కాదు అంటూ పేర్కొన్నారు. చైనా ప్రధాని కుట్రలకు అనుగుణంగా నేపాల్ ప్రధాని నడుచుకోవడం దారుణం అన్న  ఆయన... ఇకనైనా నేపాల్ తమ తీరు మార్చుకొని  తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని హితవు పలికారు. శ్రీరాముడి జన్మ స్థలం గురించి తెలిసి తెలియని వాక్యాలు మాట్లాడడం సరైనది కాదు అంటూ తెలిపారు ఆయన .

మరింత సమాచారం తెలుసుకోండి: