కేరళ గోల్డ్ స్కాం ఇప్పుడు దేశంలో సంచలనంగా మారింది. ఈ విషయంలో జాతీయ దర్యాప్తు సంస్థ కాస్త దూకుడుగానే విచారణ చేస్తుంది అనే  చెప్పాలి. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరినీ అరెస్ట్ చేసింది ఎన్ఐఏ. స్వప్న సురేష్ సహా సందీప్ నాయర్ అనే ఇద్దరినీ అదుపులోకి తీసుకుంది. ఇక ఇప్పుడు మరి కొందరిని జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుంది. 

 

కేరళగోల్డ్ స్మగ్లింగ్ కేస్ లో కస్టమ్స్ కొచ్చి అధికారులు మరో 3 మందిని అరెస్టు చేసారు. ఎర్నాకుళంలోని మువత్తుపుళకు చెందిన జలాల్, మలప్పురం నుండి మొహద్ షఫీ, కొండోట్టి నుండి హంజాద్ అలీ ని అరెస్ట్ చేసారు.  వారిని ఈ రోజు ఆర్థిక నేరాల కోర్టులో హాజరుపరుస్తారని అధికారులు పేర్కొన్నారు. వారిని ఎన్ఐఏ కి అప్పగిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: