విశాఖలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం  ఇప్పుడు సంచలనంగా మారింది. వరుస ప్రమాదాలతో విశాఖ ఇప్పుడు భయపడుతుంది. ఇక అక్కడి ప్రజలు కూడా ఎప్పుడు ఎం జరుగుతుందా అనే ఆందోళనలో ఉన్నారు అని చెప్పాలి. నిన్న రాత్రి జరిగిన ప్రమాదం దెబ్బకు ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాలు కూడా షేక్ అయ్యాయి. 

 

అయితే ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం లేకపోవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేసారు. విశాఖ ఫార్మా సిటీలో ప్రమాదం విచారకరమని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు. సకాలంలో స్పందించి ప్రాణ నష్టం నివారించిన అధికారులకు ధన్యవాదాలు తెలిపారు ఆయన. దర్యాప్తులో అన్ని వివరాలు తేలుతాయని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: