కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ కేబినేట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. వెలగపూడి సచివాలయంలో 11 గంటలకు ఈ సమావేశం జరుగుతుంది. సచివాలయం ఫస్ట్ బ్లాక్ లో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఇసుక అక్రమ రవాణాతో పాటుగా కొత్త జిల్లాల ఏర్పాటుపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. 

 

అదే విధంగా కరోనా కట్టడి సహా అనేక విషయాల మీద కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ విధిస్తున్నారు. దీనిపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగే సూచనలు ఉన్నాయని తెలుస్తుంది. తిరుపతిలో కరోనా కేసులపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. తిరుమల దర్శనాలను నిలిపివేసే అవకాశం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: