నేటి తరం హీరోయిన్లలో హాట్ హాట్ అందాలకు  దూరంగా చక్కటి అభినయానికి  దగ్గరగా ఉండే హీరోయిన్ కీర్తి సురేష్. అందుకే దర్శక నిర్మాతలు కీర్తి సురేష్ కోసం పాత్రను ప్రత్యేకంగా రాసుకుంటారు. తెలుగు చిత్ర పరిశ్రమ లో  ఎన్నో సినిమాల్లో నటించి ఎంతగానో గుర్తింపు సంపాదించింది కీర్తి సురేష్. ఇక వైవిధ్యమైన పాత్రలకు కీర్తి సురేష్ కేరాఫ్ అడ్రస్ గా మారింది. ముఖ్యంగా అలనాటి గొప్ప నటి  సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమా లో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్  తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది అనే చెప్పాలి. నేటి తరం సినీ ప్రేక్షకులందరికీ సావిత్రి అంటే కీర్తి సురేష్ అనేంతలా ఆ పాత్ర లో ప్రభావితం చేసింది. 

 

 ఈ సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ సంపాదించిన కీర్తి సురేష్... ఆ తర్వాత కథల ఎంపికలో ఎంతో ఆచితూచి అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వరుస అవకాశాలు అందుకుంటూ బిజీ బిజీగా ఉంది కీర్తిసురేష్. అయితే తెలుగులో కీర్తి సురేష్ ఇటీవలే  పెంగ్విన్ అనే సినిమాతో ఓటిటి  వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా డైనమిక్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న సినిమాలో కీర్తి సురేష్  అవకాశాన్ని దక్కించుకుందట. ఈ సినిమాకు అలివేలుమంగ వెంకటరమణ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారట చిత్రబృందం.

 

 వైవిధ్యత్మకమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గురించి మొన్నటి వరకు పలువురు  పేర్లు ప్రచారంలో ఉండగా తాజాగా కీర్తిసురేష్ ను  ఫైనల్ చేసినట్లు సమాచారం. ఇప్పటివరకు ఎన్నో యాక్షన్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులు అందరినీ ఎంతగానో అలరించిన గోపీచంద్ కి ఇది ఒక డిఫరెంట్ జోనర్ అనే చెప్పాలి. దర్శకుడు తేజ వినిపించిన కథ గోపీచంద్ కు బాగా నచ్చడంతో... ఈ సినిమా తన కెరీర్లో కీలక మైలురాయి గా మారుతుందని గోపీచంద్ భావిస్తున్నాడట. మరి టైటిల్ తోనే అందరిని ఆకర్షించిన దర్శకుడు తేజ సినిమాతో ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తాడో  అన్నది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: