ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక ధర్యాపు బృందం సిట్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. బెజవాడ రియల్ వ్యాపారి గుమ్మడి సురేష్ అలాగే రిటైర్ అయిన ఎమ్మార్వో హస్తం కూడా ఉందని భావించిన పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. అసైన్డ్ భూముల వ్యవహారాలకు సంబంధించి ఇప్పుడు ఈ విచారణ జరుగుతుంది. 

 

సురేష్ రాజధాని ప్రాంతంలో 40 ఎకరాలను కొన్నాడు అని గుర్తించారు అధికారులు. ఇప్పుడు వీరు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక వీరి వెనుక రాజకీయ నాయకుల హస్తం ఉందా అనే దాని మీద కూడా ఆరా తీస్తున్నారు. మాజీ మంత్రులు పుల్లారావు నారాయణకు వీరికి సంబంధం ఉందా అనే దాని మీద ఆరా తీస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: