హైదరాబాద్ లో ప్రైవేట్ ఆస్పత్రుల అరాచకాలు ఏ మాత్రం ఆగడం లేదు. ఒక  పక్క కరోనా వైరస్ తో ప్రాణాలు కోల్పోతుంటే తమ వ్యాపారాలకు ఏ విధమైన ఇబ్బందులు రాకుండా వ్యవహరిస్తున్నాయి హైదరాబాద్ లో ప్రైవేట్ ఆస్పత్రులు.  కరోనా చికిత్సకు అవసరమైన కొన్ని మందులను బ్లాక్ మార్కెట్ కి తరలిస్తున్నాయి. 

 

తమ చెప్పు చేతల్లో ఉండే ఫార్మా కంపెనీల ద్వారా వాటిని విక్రయిస్తూ ఈ టైం లో కూడా వ్యాపారాలు చేస్తూ వస్తున్నాయి.  ఒక ఫార్మా యజమానిని అదుపులోకి తీసుకోగా భారీగా కుంభకోణం బయటపడింది. కరోనా చికిత్సకు అవసర౦ అయ్యే వాటిని వేలల్లో విక్రయిస్తూ ఉన్న ధరకు నాలుగు నుంచి 6 రెట్లు అధికంగా విక్రయిస్తూ ఉమ్మడి వ్యాపారం చేసుకుంటున్నారు కొందరు ప్రబుద్దులు.

మరింత సమాచారం తెలుసుకోండి: