దేశ వ్యాప్తంగా కరోనా రికవరీ రేటు చాలా వేగంగా పెరుగుతుంది. కరోనా కట్టడికి సంబంధించి... ఇప్పుడు వైద్య సేవలను వేగంగా పెంచడంతో కరోనా నుంచి కోలుకుంటున్నారు. గత 24 గంటలలో కరోనా నుంచి కోలుకునే రోగుల సంఖ్య గణనీయంగా  పెరిగింది అని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా ప్రకటించింది. 

 

గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 20,572 మంది కరోనా నుంచి కోలుకుని బయటపడ్డారు అని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 5,92,031 గా ఉంది అని కేంద్రం పేర్కొంది. రికవరీ రేటు నేడు 63.24% కి చేరుకుందని భారత ప్రభుత్వం వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: