జార్జిండ్ హైకోర్టు తబ్లిఘి జమాత్తో సంబంధం ఉన్న 17 మంది విదేశీ పౌరులకు రూ .10,000 బెయిల్ బాండ్పై బెయిల్ మంజూరు చేసింది. వీసా నిబంధనలు, లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు రాంచీలోని హింద్పిరి ప్రాంతం నుంచి మార్చిలో వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇక కరోనా దేశంలో విస్తరించడానికి వారే కారణం అనే ఆరోపణలు ఎక్కువగా వినిపించిన సంగతి తెలిసిందే.
దీనితో విదేశాల నుంచి వచ్చి ఢిల్లీ మర్కజ్ భవన్ లో సమావేశంలో పాల్గొన్న చాలా మందిని పదేళ్ళ పాటు భారత్ రాకుండా కేంద్రం నిషేధం విధించింది. వారు దేశానికి రావడానికి అర్హులు కాదని పేర్కొంది. ప్రస్తుతం కొంత మంది దేశ రాజధాని ఢిల్లీ జైల్లో ఉండగా మరికొందరిని స్వదేశాలకు పంపించింది కేంద్ర ప్రభుత్వం.