కాంగ్రెస్  పార్టీ ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. పార్టీలో చాలా వరకు కూడా యువనేతలు ఉండటానికి ఏ మాత్రం ఆసక్తి చూపించడం లేదు. రాహుల్ టీం లో కీలకంగా భావించే జ్యోతిరాదిత్య సింధియాతో పాటుగా ఇటీవల మరికొందరు నేతలు పార్టీకి షాక్ ఇచ్చారు. తాజాగా సచిన్  పైలెట్ వ్యవహారం కూడా పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. 

 

ఈ తరుణంలో కాంగ్రెస్ ఎంపీ, అగ్ర నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేసారు. పార్టీని వదిలి వెళ్ళే వారు ఎవరు అయినా సరే వెళ్లిపోవచ్చు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ తో పాటుగా రాజకీయ వర్గాల్లో కూడా సంచలనంగా మారాయి. ఎవరిని కూడా ఆపే ఉద్దేశం తమకు లేదన్నారు రాహుల్. యువకులకు ఎప్పటికి కాంగ్రెస్ లో ప్రాధాన్యత ఉంటుందని తమకు ఎవరిని బ్రతిమిలాడే ఉద్దేశం లేదన్నారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి: