వరుసగా 20 రోజులు నుండి పెరుగుతున్న పెట్రోల్ ధర ఈరోజు కూడా పెరిగింది. కాకపోతే డీజల్ ధర కాస్త తగ్గింది. నెల క్రితం వరుకు 76 రూపాయిలు ఉన్న పెట్రోల్ ఇప్పుడు 80 రూపాయలకు దగ్గరలో చేరింది. గత 20 రోజుల నుంచి వరుసగా పెరుగుతునే ఉంది.. ఇంకా డీజల్ ధరలు స్థిరంగా కొనసాగుతూ వచ్చి ఒక్కసారిగా పడిపోయింది.  

 

వివిధ మెట్రో నగర్లో నేడు శనివారం పెట్రోల్ ధర లీటర్ కు 10 పైసల చొప్పున పెరగగా డీజిల్ ధర మాత్రం పెట్రోల్ కి వ్యతిరేకంగా 5 పైసలు తగ్గింది. హైదరాబద్ లో పెట్రోల్ ధర లీటర్ 10 పైసలు పెరుగుదలతో రూ. 79.22కు చేరగా, డీజల్ ధర గత నాలుగు రోజుల నుంచి స్థిరంగా కొనసాగి నేడు 5 పైసలు తగ్గింది. ఇంకా విజయవాడలోని పెట్రోల్, డీజిలు ధరలు కూడా ఇలాగె కొనసాగుతున్నాయి. 

 

దేశ రాజధాని ఢిల్లీలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు ఇలాగె కొనసాగుతున్నాయి. కాగా ఆర్ధిక రాజధాని అయినా ముంబైలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడమే ఇందుకు కారణం అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. 

 

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.59 శాతం తగ్గుదలతో 63.49 డాలర్లకు క్షీణించింది. మారో వైపు గత 20 రోజులుగా పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కేవలం 20 రోజుల్లో పెట్రోల్ ధరపై 4 రూపాయిలు పెరిగింది. 

 

దీంతో 20 రోజుల ముందు 76 రూపాయిలు ఉన్న పెట్రోల్ ధర 10పైసలు, 15 పైసలు ప్రకారం పెరిగి చివరికి 80 రూపాయలకు దగ్గరలో ఉంది. ఇది ఇలాగే కొనసాగితే ఇంట్లో వాహనాలు పెట్టి నడుచుకుంటూ వెళ్లే రోజులు త్వరలోనే వస్తాయిని కొందరు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నార. ఇంతలా రోజురోజుకు పెరిగే పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడు తగ్గుతాయి అనేది మార్కెట్ నిపుణులు కూడా అంచనా వేయలేకపోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: