పెట్రోల్, డీజల్ ధరలు గత 20 రోజులుగా ఒకే రీతిలో కొనసాగుతున్నాయి. తగ్గటం, ఎక్కటం ఎం లెవ్.. డైరెక్ట్ పెరగడమే ఇక్కడ జరుగుతుంది. ఇంకా పెట్రోల్ ధరల వద్దకు వస్తే నేడు పెట్రోల్ ధర 11 పైసలు పెరిగితే.. డీజల్ ధర మాత్రం అలానే ఉంది. దీంతో నేడు హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.79.56కు చేరగా డీజిల్ ధర మాత్రం రూ.71.73 వద్ద స్థిరంగా ఉంది.  

 

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా కదలాడుతున్నాయి. ఇంకా వివిధ మెట్రో నగరాల్లో ఈరోజు పెట్రోల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. అమరావతిలో పెట్రోల్ ధర 11 పైసలు పెరుగుదలతో 79.12రూపాయలకు చేరగా, డీజల్ ధర మాత్రం 71.04 వద్ద స్థిరంగా కొనసాగుతుంది. విజయవాడలోనూ ఈ పెట్రోల్, డీజల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర 12పైసలు పెరుగుదలతో 78. రూపాయలకు చేరగా.. డీజల్ ధర మాత్రం స్థిరంగా 70.70పైసల్ వద్ద స్థిరంగా కొనసాగుతుంది. 

 

ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు ఇలాగె కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర 10 పైసలు పెరుగుదలతో 74.66 రూపాయిలకు, డీజిల్ ధర 65.73 రూపాయిలకు చేరింది. కాగా ఆర్ధిక రాజధాని అయినా ముంబైలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా కదిలాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.03 శాతం తగ్గుదలతో 62.35 డాలర్లకు క్షీణించింది.

 

అయితే గత 20 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు రోజుకు 10, 15 పైసల్ పెరుగుదలతో 4రూపాయిలు పెరిగింది. పైసలు రూపంలో వాహనదారులకు కనిపించడం లేదు కానీ... నిజానికి పెట్రోల్, డీజల్ ధరలు రోజురోజుకు పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం ఈ పెట్రోల్ డీజల్ ధరలు పెరగడంతో వాహనదారులు తలలు పట్టుకుంటున్నారు. మరి ఈ పెట్రోల్, డీజల్ ధరలు ఎప్పుడు తగ్గుతాయి చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: