అవును.. లాక్ డౌన్ కారణంగా బ్యాంకులు అన్ని వడ్డీ తగ్గిస్తున్నాయి.. ఏం చెయ్యాలో తెలియదు.. ఇంకా చేతిలో ఉన్న డబ్బుతో ఏమైనా బిజినెస్ చేద్దాం అంటే ఈ లాక్ డౌన్ కారణంగా ఏ బిజినెస్ ఎలా జరుగుతుందో తెలియదు. అలాంటి ఈ సమయంలో చేతిలో ఉన్న డబ్బుతో ఏదొక విధంగా సంపాదించాలి అనుకుంటున్నారా? అయితే మోకోసమే ఈ అదిరిపోయే స్కిమ్ అందుబాటులో ఉంది.
అది ఏంటి అంటే? అదే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. దీన్ని (PPF) అని అంటారు. ఇంకా అదిరిపోయే ఈ స్కీమ్లో చేరడం వల్ల ప్రతి నెలా కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చెయ్యాలి. ఇంకా ఈ డబ్బుకు ఎలాంటి రిస్క్ ఉండదు.. ఖచ్చితమైన రాబడి పొందగలరు.. ఇంకా పీపీఎఫ్ తో సాధారణంగా దీర్ఘకాల ఇన్వెస్ట్మెంట్ సాధనంగా భావిస్తారు.
అయితే పీపీఎఫ్ మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లు. ఇంకా దీని మెచ్యూరిటీ కాలందాటాక కూడా పీపీఎఫ్ అకౌంట్ను కొనసాగించొచ్చు. 5 సంవత్సరాల చొప్పున మెచ్యూరిటీ కాలాన్ని పొడిగించుకునే అవకాశం ఎక్కువ ఉంది. ఇంకా ఈ పీపీఎఫ్ అకౌంట్పై ఏకంగా 7.1 శాతం వడ్డీ రేట్లు ఇస్తుంది.
ప్రతి మూడు నెలలకు ఒకసారి పీపీఎఫ్ అకౌంట్పై వడ్డీ రేట్లు పెరోగొచ్చు లేదు అంటే స్థిరంగా కూడా ఉండి పోవచ్చు. అయితే ఈ స్కీమ్ లో చేరేందుకు 18 ఏళ్ల వయసు నిండి ఉండాలి. అప్పుడే ఈ స్కీమ్స్ కి అర్హులు. ఆధార్ కార్డు, ఓటరు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి కేవైసీ డాక్యుమెంట్లు ఉంటె ఈ స్కీమ్ కు అర్హులు.