దేశీ దిగ్గజ కార్ల తయారీ సంస్ద మారుతీ సుజుకి ఇండియా తమ కస్టమర్ల కోసం మరో అద్భుతమైన శుభవార్త చెప్పింది. ఆ వార్త వింటే ఎవరైనా సరే వావ్ అని అంటారు. అంతటి శుభవార్త ఏంటో అని అనుకుంటున్నారా? అదేనండి.. తక్కువ వడ్డీకే రుణ సౌకర్యం, అతి తక్కువ నెలవారీ ఈఎంఐ, లోన్ మారటోరియం వంటి ప్రయోజనాలు ఉన్నాయి. 

 

IHG

 

ఇంకా వీటితో మారుతీ సుజుకీ తాజాగా యాక్సిస్ బ్యాంక్‌తో జతకట్టింది. దీంతో యాక్సిస్ బ్యాంక్ మారుతీ సుజుకి కారు కొంటే ఎన్నో రకాల లోన్ ఆప్షన్స్ ఇస్తుంది. అయితే కారు కొనుగోలుపై తీసుకున్న రుణాన్ని 8 ఏళ్లలో చెల్లించాల్సి ఉంటుంది. ఆకర్షణీయమైన ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఇస్తుంది. 

 

IHG

 

ఇంకా కారు కొన్నప్పుడు ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే లక్ష రూపాయలకు 1250 రూపాయిల నుండి ఈఎంఐ ప్రారంభమవుతుంది. కరోనా వైరస్ నేపథ్యంలో లోన్ తీసుకుంటే వారికీ ఈ ఆప్షన్ అందుబాటులో ఉంది. అయితే తొలి మూడు ఈఎంఐలకు నెలకు రూ.899 చెల్లిస్తే సరిపోతుంది. ఇంకా ఎన్నో అద్భుతమైన ఈఎంఐ ఆప్షన్లు ఉన్నాయి. 
 

IHG

 

అయితే ఈ ఆఫర్లు కేవలం జులై 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కేవలం ఉద్యోగం చేసేవారు మాత్రమే కాకుండా దీనికి స్వయం ఉపాధి పొందుతున్న వారు కూడా కారు కొనేందుకు సులభంగానే రుణం పొందే అవకాశం ఉంది. మరి ఇంకేందుకు ఆలస్యం కారు కొనాలి అనుకుంటే వెంటనే కోనేయండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: