జియో దెబ్బకి అన్ని సెల్ ఫోన్ సంస్థలూ దిగి వస్తున్నాయి. మొబైల్ నెట్వర్క్ దిగ్గజం ఐడియా ఇప్పుడు విస్తృత ఆఫర్ లు ప్రకటిస్తోంది. 1 జీబీ ధర కే 15 జీబీ డేటాని అందిస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. అయితే ఈ ఆఫ‌ర్ పొందేందుకు చిన్న ష‌ర‌తు కూడా విధించింది. ఈకామ‌ర్స్ ప్ర‌ముఖ  సంస్థ‌ ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ కొనుగోలు చేసిన వారికే ఈ ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంద‌ని మెలిక పెట్టింది. మార్చి 31వ తేదీలోపు ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ కొనుగోలు చేసిన అంద‌రికీ ఈ ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంద‌ని ఐడియా పేర్కొంది.

 

అలాగే కొత్త‌ సిమ్‌కు అప్‌గ్రేడ్ అయ్యే ఐడియా ఖాతాదారులు కూడా సరికొత్త ఆఫ‌ర్‌ను వినియోగించుకోవ‌చ్చ‌ని తెలిపింది. ఈమేర‌కు ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం చేసుకున్న‌ట్టు వివ‌రించింది. ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ కొన్న త‌ర్వాత తొలుత 1జీబీ డేటా ప్యాక్ వేసుకోవడం ద్వారా ఈ ఆఫ‌ర్‌ను యాక్టివేట్ చేసుకోవ‌చ్చు. మిగిలిన 14 జీబీని అద‌న‌పు డేటాగా ఉప‌యోగించుకోవ‌చ్చు. 28 రోజుల వ్యాలిడిటీ ఉండే ఈ ప్యాక్‌ను మార్చి 31లోపు మూడుసార్లు వినియోగించుకునే వీలుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: