కావాల్సిన పదార్థాలు:
మైదాపిండి: 2 కప్పులు
నెయ్యి: 4 టేబుల్స్పూన్లు
ఉప్పు: చిటికెడు
యాలకులపొడి: టీస్పూను
బెల్లం తురుము: అరకప్పు
అంజీర్ పేస్టు: పావుకప్పు
జీడిపప్పుపొడి: అరకప్పు
బాదంపప్పు పొడి:అరకప్పు
ఎండుకొబ్బరి తురుము: 2 టీస్పూన్లు
తయారీ విధానం:
ముందుగా ఓ గిన్నెలో మైదా, ఉప్పు, టీస్పూను నెయ్యి వేసి సరిపడా నీళ్లతో చపాతీపిండిలా కలిపి ఓ గంటసేపు నాననివ్వాలి. వేరే గిన్నెలో జీడిపప్పుపొడి, బాదంపప్పుపొడి, అంజీర్ముద్ద, ఎండుకొబ్బరి తురుము, యాలకులపొడి వేసి బాగా కలిపి చిన్న చిన్న ముద్దల్లా చేసుకోవాలి.
మైదాపిండిని పూరీల్లా చేసి దాని మధ్యలో కలిపిన జీడిపప్పు, బాదంపొడి మిశ్రమాన్ని ఉంచి అంచులు మూసేసి బొబ్బట్ల మాదిరిగా వత్తాలి. పెనంమీద నుంచి నెయ్యి వేస్తూ రెండువైపులా కాల్చి తీయాలి. అంతే ఎంతో సులువుగా వేడి వేడి డ్రై ఫ్రూట్ బొబ్బట్టు రెడీ.
డ్రై ఫ్రూట్స్ ప్రతి రోజు తినడం వల్ల శరీరంలో ఒక బలమైన వ్యాధినిరోధక వ్యవస్థ పొందడానికి ఉపయోగపడతాయి. ఆరోగ్యానికి కాలవలసిన పోషకాహారం పుష్కలంగా డ్రై ఫ్రూట్స్లో ఉన్నాయి. సో డ్రై ఫ్రూట్స్ను విడిగా తినలేని వారు ఇలా డ్రై ఫ్రూట్ బొబ్బట్లు చేసుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంది.