కావాల్సిన పదార్థాలు:
కార్న్- ఒకటి
పాలు- రెండు కప్పులు
జీడిపప్పు- కొద్దిగా
యాలకుల పొడి- అర టీస్పూను
నెయ్యి- అర టేబుల్ స్పూను
పంచదార- నాలుగు టేబుల్ స్పూన్లు
బాదం పప్పు- కొద్దిగా
పిస్తా- కొద్దిగా
కుంకుమ పువ్వు- చిటికెడు
తయారీ విధానం:
ముందుగా మిక్సీలో కార్న్ వేసి దానికి పాలు చేర్చి ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద పాన్లో నెయ్యి వేడి చేసి ఈ ముద్దను అందులో వేసి నాలుగు నిమిషాలపాటు చిన్న మంట మీద వేయించాలి. తర్వాత అందులో పాలు పోసి కలపాలి. పాలల్లో కుంకుమ పువ్వు వేసి పక్కనుంచుకోవాలి. పాయసాన్ని చిన్న మంట మీద ఉంచి పది నిమిషాలపాటు అడుగంటకుండా ఉడికించాలి.
ఇప్పుడు దీంట్లో చక్కెర కలపాలి. పాయసం చిక్కబడేవరకూ ఉడికించి యాలకుల పొడి వేయాలి. అలాగే చివర్లో జీడిపప్పు, బాదం, పిస్తా చల్లి స్టౌ ఆఫ్ చేస్తే సరిపోతుంది. అంతే యమ్మీ యమ్మీ స్వీట్ కార్న్ పాయసం రెడీ.. దీన్ని వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది. చిన్న పిల్లలు కూడా దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు. సో.. తప్పకుండా ట్రై చేయండి..!