కావాల్సిన పదార్థాలు:
బాస్మతీ రైస్- 2 కేజీలు
చికెన్- ఒక కేజీ చొప్పున
ఉలవచారు- అరకిలో
నెయ్యి- 100 గ్రాములు


బిర్యాని మసాలా దినుసులు- కొద్దిగ‌
పసుపు- 50గ్రాములు
ఉప్పు, కారం- తగినంత
నిమ్మకాయలు- 2
ఉల్లిపాయలు- 2


పెరుగు- 3 స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్టు- 2 స్పూన్లు
పచ్చిమిర్చి- 150 గ్రాములు
పుదీనా తరుగు- 4 టేబుల్ స్పూన్లు
బిర్యానీ ఆకులు- 4


తయారీ విధానం:
ముందుగా గిన్నెలో కొద్దిగా నెయ్యిని వేసి మసాలా దినుసులను వేగించాలి. ఆ తరువాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకులు వేసి అవి దోరగా వేగాక రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు వేయాలి. రెండు నిమిషాలాగి కొద్దిగా పుదీనా, పెరుగు వేసి లీటరున్నర నీళ్లు పోయాలి.


నీళ్లు మరిగాక బాస్మతీ బియ్యం, ఉప్పువేసి ఉడికించాలి. వేరొక గిన్నెలో రెండు టీస్పూన్లు నూనె వేసి, ఉల్లిపాయ ముక్కల్ని వేగించాలి. అవి గోధుమరంగులోకి వచ్చాక అల్లంవెల్లులి పేస్టు, చికెన ముక్కలు వేయాలి. రెండు నిమిషాలు అయ్యాక‌ అరలీటరు నీళ్లు పోసి ఉడికించాలి.


ఆ తరువాత అందులో అరకిలో ఉలవచారు వేసి పసుపు, సరిపడినంత ఉప్పు, కారం, వేసి కొద్దిసేపు ఉడికించాలి. ఈ ఉలవచారు చికెన కర్రీని ముందుగా తయారు చేసుకున్న బిర్యానిలో కలిపి పైన కొత్తిమీరతో గార్నిష్‌ చేస్తే స‌రిపోతుంది. అంతే ఉలవచారు చికెన్ బిర్యాని రెడీ..!  


మరింత సమాచారం తెలుసుకోండి: