ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల‌ను గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న సంగ‌తి తెలిసిందే. గంట గంటకూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. నిన్న 32 లక్షలు ఉన్న కేసులు ఒక్క రోజులోనే మరో లక్ష దాటింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 33 ల‌క్ష‌ల‌కు పైగాకరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరణాల సంఖ్య 2.30 ల‌క్ష‌లు దాటేసింది. అయితే ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లోనూ కొంద‌రు మాన‌వ‌మృగాల బ‌రిదెగింపులు ఆగ‌డం లేదు. కామవాంఛ తీర్చుకోవ‌డ‌మే ప‌నిగా పెట్టుకుంటున్నారు. దిశ వంటి కఠిన చట్టాలు తీసుకొచ్చినా, ఉరి శిక్షలు వేస్తున్నా కామాంధుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. 

 

మహిళలపై ఘోరాలు, అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా  బైక్‌పై వెళ్తున్న అన్నాచెల్లెళ్లపై కొంద‌రు కామాంధులు దారుణంగా ప్ర‌వ‌ర్తించారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..  మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన అమ్మాయి(18) ఆమె అన్న(21) బైక్‌లో పెట్రోల్ కోసం సమీపంలోని పధార్ పట్టణానికి వెళ్లారు. పెట్రోల్ కొట్టించుకుని తిరిగి వ‌స్తుండ‌గా దారిలో ఏడుగురు దుండగులు బైక్‌ని అడ్డగించి.. యువతి అన్నపై దారుణంగా దాడి చేశారు. అపై అత‌డిని స‌మీపంలో ఉన్న‌ బావిలో పడేశారు. ఆ వెంట‌నే యువతిని అడవిలోకి లాక్కెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. 

 

ఏడుగురు మృగాళ్లు పైశాచికంగా పశువాంచ తీర్చుకోవడంతో ఆమె స్పృహ‌ కోల్పోయింది. ఇక ఆనంత‌రం నిధింతులు అక్క‌డ నుంచి ప‌రార్ అయ్యారు. అయితే ఆ అన్నాచెల్లెళ్లు ఎంత సేప‌టికి ఇంటికి రాక‌పోవ‌డంతో త‌ల్ల‌దండ్రులు మ‌రియు వారి బంధువులు వెంత‌క‌డం మొద‌లు పెట్టారు. ఈ క్రమంలోనే స‌ద‌రు అన్నాచెల్లెళ్లు దారుణ స్థితిలో క‌నిపించ‌డంతో వెంట‌నే వారిని హాస్ప‌ట‌ల్‌కి త‌ర‌లించి.. పోలీసుల‌కు స‌మాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి.. ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. పరారీలో మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. కాగా, 

  
 

మరింత సమాచారం తెలుసుకోండి: