కాలం మారినప్పటికీ మనుషులు ఇంకా మారడం లేదు. మనం ఎంత అనుకున్న సరే మారుమూల గ్రామాల్లో ఇంకా మూఢనమ్మకాలను పట్టుకొని వేలాడుతున్నారు. ఇంకా ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరో దారుణమైన ఘటన ఛత్తీస్గఢ్లో చోటు చేసుకుంది. భార్యకి సుఖ ప్రసవం కావలి అని పూజలు చేయించిన భర్త తీరా బిడ్డ చనిపోవడంతో మంత్రగాడిని ఇంటికెళ్లి నరికేసిన అమానుష ఘటన చోటుచేసుకుంది.
ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దంతెవాడ జిల్లా గొలగూడ గ్రామానికి చెందిన హిద్మా సోరి భార్య నిండు గర్భిణి. అయితే ఆమెకు సుఖ ప్రసవం జరగాలని అదే గ్రామానికి చెందిన మంత్రగాడు దేవ మార్కమ్తో సోరి ప్రత్యేక పూజలు చేయించాడు. కొన్ని గంటలపాటు మంత్రాలు చదువు అతను పూజలు చేశాడు..
ఇంకా పూజలు అనంతరం ఆ మంత్రగాడు అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే తెల్లవారుజాము సమయంలో సోరి భార్య మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే జన్మించిన రెండు గంటలకే ఆ పిల్లడు కన్నుమూశాడు. దీంతో వైద్యం సాయం అందకపోవడం వల్లే బిడ్డ మరణించింది అని తెలుస్తోంది.
దేవ మార్కమ్ సరిగ్గా పూజలు చేయకపోవడం వల్లే బిడ్డ చనిపోయాడని సోరి కోపంతో ఊగిపోయాడు. అంతరం పూజలు చేయమంటే చేతబడి చేశాడని ఆరోపిస్తూ మంత్రగాడు దేవ మార్కమ్ని ఇంటికెళ్లి అతన్ని బయటకు లాగి గొడ్డలితో నరికి కిరాతకంగా చంపేశాడు. తన బిడ్డకు చేతబడి చేశాడు అని హత్యచేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిందుతుడిని అదుపులోకి తీసుకున్నారు.