వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈఓ, గ్రేడ్-2) ఉద్యోగాల ఎంపిక ఎట్టకేలకు పూర్తయింది. మొత్తం 1,258 మందిని ఎంపిక చేస్తూ సోమవారం (జనవరి 16) టీఎస్‌పీఎస్‌సీ జాబితా విడుదల చేసింది. వాటిని వెబ్‌సైట్లో ఉంచింది. వ్యవసాయ శాఖలో 311 ఏఈఓ పోస్టుల భర్తీకి 2016 మార్చి 13న, మరో వెయ్యి పోస్టులకు జూన్ 4వ తేదీన పరీక్షలు నిర్వహించింది. 311 పోస్టులకు 283 మంది, వెయ్యి ఉద్యోగాలకు 975 మంది ఎంపికయ్యారు. మరో 53 పోస్టులకు అర్హులు లేకపోవడంతో వాటిని భర్తీ చేయలేదని టీఎస్‌పీఎస్‌సీ తెలిపింది. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌ను పరిశీలించాలని సూచించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: