వికాస్ ఆధ్వర్యంలో ముమ్మిడివరంలోని ఎయిమ్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఈ నెల 19, 20 తేదీల్లో మినీ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు వికాస్ పథక సంచాలకుడు వీఎన్‌ రావు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.10 వేల నుంచి రూ.40 వేల వరకు వేతనంగా చెల్లిస్తారన్నారు. ఇంటర్‌, డిప్లొమా, డిగ్రీ, బీటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ విద్యార్హత కలిగి 18 నుంచి 30 సంవత్సరాలలోపు గల అభ్యర్థులు ఇంటర్వ్యూకి అర్హులన్నారు. ఆసక్తి గలవారు ఉదయం తొమ్మిది గంటలకు బయోడేటా, విద్యార్హతల జిరాక్స్‌ కాపీలతో ఇంటర్వ్యూకి హాజరుకావాలన్నారు. వివరాలకు వికాస్ వెబ్‌సైట్‌ను చూడాలన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: