గత నెలలో నిర్వహించిన ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు ఈ నెల 8న విడుదల కానున్నాయి. ఒకేసారి ఫస్టియర్‌, సెకండియర్‌ జనరల్‌, ఒకేషనల్‌ ఫలితాలను మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం ఉదయం 10 గంటలకు విశాఖపట్నంలోని డాక్టర్‌ ఎల్‌.బి. కాలేజీ సెమినార్‌ హాల్‌లో ఫలితాలను విడుదల చేస్తారు. ఈ విషయాన్ని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: