ముంబైలోని షిప్పింగ్
కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్సీఐఎల్).. గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజనీర్స్
(జీఎంఈ) కోర్సులో ప్రవేశాలకు అర్హులైన అవివాహ మెకానికల్ ఇంజనీర్స్ నుంచి
దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ కోర్సు ఎస్సీఐఎల్కు చెందిన మారిటైమ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్
(ఎంటీఐ), ముంబైలో 2018, మార్చి 1న ప్రారంభమవుతుంది.
కోర్సు: గ్రాడ్యుయేట్
మెరైన్ ఇంజనీర్స్ (జీఎంఈ).
మొత్తం సీట్లు: 40 (అన్రిజర్వుడ్-20+ఓబీసీ-11+ఎస్సీ-6+ఎస్టీ-3).
శిక్షణ వ్యవధి: 18 నెలలు. ఇందులో 8 నెలల ప్రి-సీ ట్రైనింగ్, 10 నెలలు స్ట్రక్చర్డ్ షిప్బోర్డ్
ట్రైనింగ్.
స్టైపెండ్: రూ.15,000 (స్ట్రక్చర్డ్ షిప్బోర్డ్
ట్రైనింగ్లో).
అర్హతలు: మెకానికల్
ఇంజనీరింగ్లో కనీసం 50 శాతం మార్కులతో బీఈ/బీటెక్ లేదా తత్సమాన విద్య. అలాగే
పదోతరగతి, ఇంటర్మీడియెట్లో ఇంగ్లిష్ సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులు పొంది
ఉండాలి.
వయసు: 2018, మార్చి 1 నాటికి 28 ఏళ్లు మించకూడదు.
ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, మహిళలకు రెండేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక: ఆల్ ఇండియా ఆన్లైన్
టెస్ట్, ఇంటర్వ్యూ.
ఆన్లైన్ పరీక్ష కేంద్రాలు: ముంబై, న్యూఢిల్లీ, కోల్కత, చెన్నై.
దరఖాస్తు రుసుం: రూ.1,000 (జనరల్/ఓబీసీ); రూ.500 (ఎస్సీ/ఎస్టీ).
దరఖాస్తు విధానం: ఆన్లైన్.
చివరి తేదీ: జనవరి 20, 2018.
దరఖాస్తు చేరడానికి చివరి
తేదీ: జనవరి 23,
2018.
పూర్తి వివరాలు వెబ్సైట్లో
చూడొచ్చు
వెబ్సైట్: www.shipindia.com