ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ.. 2018కి గాను డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (డీఈఈ సెట్-2018) నోటిఫికేషన్ విడుదల చేసింది...దీనిద్వారా రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ డైట్ (డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్) కళాశాలలు, ప్రైవేటు ఎలిమెంటరీ టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్ఈడీ) కోర్సులో ప్రవేశం పొందొచ్చు. రెండేళ్ల వ్యవధి గల ఈ కోర్సు పూర్తిచేయడం ద్వారా ఉపాధ్యా య వృత్తికి బాటలు వేసుకోవచ్చు.
అర్హతలు: ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సులో కనీసం 50 శాతం (ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 45 శాతం) మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఈ కోర్సుల చివరి సంవత్సరం విద్యార్థులూ అర్హులే. అయితే ప్రవేశ సమయానికి ఉత్తీర్ణత సాధించాలి. ఇంటర్ ఒకేషనల్ కోర్సుల విద్యార్థులు అనర్హులు. ఇంగ్లిష్ మీడియంలో ఇంటర్ చదివిన విద్యార్థులు ఆ మీడియం సీట్లకే అర్హులు.
వయసు: 2018, సెప్టెంబర్ 1 నాటికి 17 ఏళ్లు నిండాలి. గరిష్ట వయోపరిమితి లేదు.
దరఖాస్తు రుసుం: రూ.500.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో.
ఫీజు చెల్లింపు, దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 12, 2018.
హాల్ టికెట్ల జారీ ప్రారంభం (ఆన్లైన్): మే 11, 2018.
డీఈఈసెట్ తేదీ: మే 17, 18.
ఫలితాలు, ర్యాంకుల వెల్లడి: మే 28, 2018.
తొలిదశ కౌన్సెలింగ్: జూన్ 4 నుంచి 15 వరకు.
రెండో దశ కౌన్సెలింగ్: జూన్ 22 నుంచి 25 వరకు.
మరిన్ని వివరాలకి క్రింద ఉన్న లింక్
ఓపెన్ చేయండి..
వెబ్సైట్: https://apdeecet.apcfss.in