ముంబైలోని బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన కార్పొరేట్ సెంటర్.. బరోడా మణిపాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీసీబీఎఫ్) కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ఈ కోర్సును విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థుల్ని బ్యాంక్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్ ఇన్ జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్/స్కేల్-1గా నియమిస్తారు.

 Jobs

కోర్సు:  పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. 

మొత్తం ఖాళీలు:  600 

కోర్సు కాల వ్యవధి: 9 నెలలు.

అర్హత: కనీసం 55% మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. 

వయసు: 20-28 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులు 3.7.1990 నుంచి 2.7.1998 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు వయోపరిమితిలోమినహాయింపు ఉంటుంది. 

ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్ (జీడీ), ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 2018, జూలై 28. ఆన్‌లైన్ పరీక్షలకు కాల్ లెటర్లను 2018, జూలై 18 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, చీరాల, చిత్తూరు, గుంటూరు, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.100. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

దరఖాస్తుకు చివరితేదీ: జూలై 2, 2018

మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:   www.bankofbaroda.co.in


మరింత సమాచారం తెలుసుకోండి: