న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన సశస్త్ర సీమా బల్..లో ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల చేసింది..ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఎస్ఐ, ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ మొదలగు వివిధ విభాగాలలో 181 పోస్టులకి ధరఖాస్తులు కోరుతోంది..పరీక్ష సమయం..ఏ పోస్ట్ కి ఎన్ని ఖాళీలు ఉన్నాయి నోటిఫికేషన్ లో పూర్తి సమాచారం ఇవ్వబడింది.

Jobs

విభాగాల వారీ ఖాళీలు:


ఎస్‌ఐ (స్టాఫ్ నర్స్ ఫీమేల్): 23


ఏఎస్‌ఐ (ఫార్మసిస్ట్): 18


ఏఎస్‌ఐ (ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్): 2


ఏఎస్‌ఐ (డెంటల్ టెక్నీషియన్): 2


ఏఎస్‌ఐ (రేడియోగ్రాఫర్): 8


ఏఎస్‌ఐ (స్టెనోగ్రాఫర్): 54


హెడ్ కానిస్టేబుల్ (మినిస్ట్రీయల్): 74


అర్హత: ఏఎస్‌ఐ (స్టెనోగ్రాఫర్), హెడ్ కానిస్టేబుల్ (మినిస్ట్రీయల్) పోస్టులకు ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు టైపింగ్ నైపుణ్యం ఉండాలి. మిగతా పోస్టులకు సైన్స్‌లో 10+2 ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగాల్లో డిగ్రీ, డిప్లొమా ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి.

వయసు: ఏఎస్‌ఐ (స్టెనోగ్రాఫర్), హెడ్ కానిస్టేబుల్ (మినిస్ట్రీయల్) పోస్టులకు 18-25 ఏళ్లు, మిగతా వాటికి 20-30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ స్టాండర్ట్ టెస్ట్ (పీఎస్‌టీ), డాక్యుమెంటేషన్, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో. 

దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, మహిళలకు దరఖాస్తు ఫీజు లేదు.

దరఖాస్తుకు చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ (2018, ఆగస్టు 11-17)లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి. 

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్www.ssbrectt.gov.in


మరింత సమాచారం తెలుసుకోండి: