న్యూఢిల్లీలోని భారత
కార్మిక మంత్రిత్వ శాఖకు చెందిన ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ)
539 ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల చేసింది..ఈ నోటిఫికేషన్ లో సోషల్
సెక్యూరిటీ ఆఫీసర్ / మేనేజర్ గ్రేడ్-2/సూపరింటెండెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ముఖ్య గమనిక - ఈఎస్ఐసీ 2014, జనవరి 16న జారీచేసిన నియామక ప్రకటనను రద్దుచేసి తాజా భర్తీ ప్రక్రియ చేపడుతోంది. నాటి ప్రకటనకు అనుగుణంగా దరఖాస్తు చేసుకున్న వారు ఫీజు చెల్లించనవసరం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హత: ఏదైనా డిగ్రీ
(కామర్స్/లా/మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్లకు ప్రాధాన్యం) ఉత్తీర్ణత. కంప్యూటర్
పరిజ్ఞానం ఉండాలి.
వయసు: 2018, అక్టోబర్ 5 నాటికి 21-27 ఏళ్ల మధ్య ఉండాలి. (రిజర్వేషన్ అభ్యర్థులకు సడలింపు
ఉంటుంది).
ఎంపిక: ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్, కంప్యూటర్ స్కిల్ టెస్ట్
అండ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ ద్వారా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో.
దరఖాస్తు ఫీజు: రూ.500 (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళలకు రూ.250).
దరఖాస్తుకు చివరితేదీ: అక్టోబర్ 5, 2018.
పూర్తి వివరాలు వెబ్సైట్లో చూడొచ్చు.
వెబ్సైట్: www.esic.nic.in