ఢిల్లీలోని భారత కార్మిక మంత్రిత్వ శాఖకు చెందిన ఈఎస్‌ఐసీ (ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్)లో  539 ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల చేసింది..ఈ నోటిఫికేషన్లో భాగంగా  సెక్యూరిటీ ఆఫీసర్/మేనేజర్ గ్రేడ్-2/సూపరింటెండెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...

Jobs

ముఖ్య గమనిక -  ఈఎస్‌ఐసీ 2014, జనవరి 16న జారీచేసిన నియామక ప్రకటనను రద్దుచేసి తాజా భర్తీ ప్రక్రియ చేపడుతోంది. నాటి ప్రకటనకు అనుగుణంగా దరఖాస్తు చేసుకున్న వారు ఫీజు చెల్లించనవసరం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హత: ఏదైనా డిగ్రీ (కామర్స్/లా/మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్లకు ప్రాధాన్యం) ఉత్తీర్ణత. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.

వయసు: 2018, అక్టోబర్ 5 నాటికి 21-27 ఏళ్ల మధ్య ఉండాలి. (రిజర్వేషన్ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది).

ఎంపిక: ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్, కంప్యూటర్ స్కిల్ టెస్ట్ అండ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ ద్వారా. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.

దరఖాస్తు ఫీజు: రూ.500 (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళలకు రూ.250).

దరఖాస్తుకు చివరితేదీ: అక్టోబర్ 5, 2018.

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

వెబ్‌సైట్www.esic.nic.in


మరింత సమాచారం తెలుసుకోండి: