ఏపీ పోస్టల్ డిపార్ట్మెంట్ విజయవాడ
పరిధిలో 46 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకి గాను నోటిఫికేషన్
విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా... సర్కిల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్
కార్యాలయాల్లో 13,
సబార్టినేట్
కార్యాలయాల్లో 33
ఖాళీలని భర్తీ చేయనున్నారు.
విభాగాల వారీ ఖాళీలు: సర్కిల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయాల్లో 13, సబార్టినేట్ కార్యాలయాల్లో 33 పోస్టులున్నాయి.
అర్హత: మెట్రిక్యులేషన్ లేదా ఐటీఐ ఉత్తీర్ణత.
వయసు: 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు గరిష్ట వయో
పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక: ఆప్టిట్యూడ్ టెస్ట్ ఆధారంగా.
పరీక్ష కేంద్రాలు: కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం.
దరఖాస్తు ఫీజు: రూ.100
పరీక్ష ఫీజు: రూ.400.(ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళలకు రూ.100).
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో.
ప్రైమరీ
రిజిస్ట్రేషన్కు చివరి తేదీ: ఫిబ్రవరి 28, 2019.
పోస్టాఫీసుల్లో
ఫీజు చెల్లించుటకు చివరితేదీ: మార్చి 5, 2019.
దరఖాస్తుకు
చివరితేదీ: మార్చి 8, 2019.
పూర్తి వివరాలకు వెబ్సైట్: www.appost.in