హైదరాబాద్
లోని ఐడీఆర్బీటీ (ఇనిస్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్
రీసర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ ) జులై సెషన్ కి సంభందించి పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్
టెక్నాలజీ లో ప్రవేశాలకై దరఖాస్తులు కోరుతోంది. ఈ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ద్వారా నెలకొల్ప బడింది.
కోర్సు వ్యవధి: 1 సంవత్సరం .
సీట్లు: 40.
అర్హత: ఏదైనా ఇంజనీరింగ్ విభాగంలో
కనీసం 60 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ
ఉత్తీర్ణత. చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక: క్యాట్/మ్యాట్/జీమ్యాట్ తదితర
పరీక్షల స్కోరు, బృంద చర్చలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.2000.
దరఖాస్తుకు చివరితేదీ: మే 22, 2019.
జీడీ, పర్సనల్ ఇంటర్వ్యూ తేదీ: జూన్ 7, 2019.
ఫలితాల వెల్లడి: జూన్ 10, 2019.
తరగతుల ప్రారంభం: జులై 1, 2019.