నేషనల్
బ్యాంకింగ్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్ ) ఉద్యోగ అవకాశ
ప్రకటన విడుదల చేసింది. బ్యాంకింగ్ రంగంలో ఇప్పటికే ఉన్న వారికి ఈ ఉద్యోగాన్ని
సొంతం చేసుకునే వీలు ఉంటుంది. నా బర్డ్ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం. 87 మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి
దరఖాస్తులు కోరుతోంది
పోస్టుల వివరాలు..
అసిస్టెంట్ మేనేజర్
(గ్రేడ్-ఏ): 79.
అర్హత:పోస్టులను బట్టి గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి
సంబంధిత విభాగంలో కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ/పీజీ/పీహెచ్డీ/సీఏ/కాస్ట్
అకౌంటెంట్/కంపెనీ సెక్రటరీ/పీజీ డిప్లొమా/ఎంబీఏ; బీఈ/బీటెక్, బీబీఏ/బీఎంఎస్ ఉత్తీర్ణత.
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు 45 శాతం మార్కులుంటే
సరిపోతుంది.
వయసు: 2019, మే 1 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు; ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; పీహెచ్సీలకు పదేళ్లు
గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
మేనేజర్ (గ్రేడ్-బి): 8.
అర్హత:గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డు నుంచి కనీసం 60 శాతం మార్కులతో బ్యాచిలర్
డిగ్రీ లేదా కనీసం 55 శాతం మార్కులతో పీజీ లేదా పీహెచ్డీ ఉత్తీర్ణత.
వయసు: 2019, మే 1 నాటికి 21-35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ఫేజ్-1 (ప్రిలిమినరీ), ఫేజ్-2 (మెయిన్) ఎగ్జామ్స్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరితేదీ: మే 26, 2019.
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://ibpsonline.ibps.in