భార‌త్‌లో న‌మోద‌వుతున్న క‌రోనా పాజిటివ్ కేసుల్లో అత్య‌ధికంగా  ఐదు రాష్ట్రాల నుంచే ఉండ‌టం గ‌మ‌నార్హం. అందులో మ‌హారాష్ట్ర మొద‌టిస్థానంలో ఉండ‌గా త‌మిళ‌నాడు, గుజ‌రాత్‌, రాజ‌స్థాన్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లు వ‌రుస క్ర‌మంలో ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లోనే వ్యాధి వ్యాప్తి ఎక్కువ‌గా ఉండ‌టం గ‌మ‌నార్హం. కొత్త పాజిటివ్ కేసుల సంఖ్య‌తో పాటు మ‌ర‌ణాల సంఖ్య కూడా అధికంగా ఉంటోంది. కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ అధికారులు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం..బుధ‌వారం ఉద‌యం నాటికి భారత్‌లో కేసుల సంఖ్య‌ 75,000కి చేరుకున్నాయి. అలాగే ఇప్పటి వరకు మొత్తం 24,420 మంది కోలుకున్నారు.

 

క‌రోనా  మరణాల్లో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉంది. గడచిన ఆరు రోజుల్లో మహారాష్ట్రలో 8,902 కేసులు నమోదుకాగా.. ఒక్క ముంబై నగరంలోనే 5,000 నిర్ధారణ అయ్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ముంబయిలో మొత్తం కేసుల సంఖ్య 14,521కి చేరింది. పుణే ప‌ట్ట‌ణంలోనూ క‌రోనా కేసుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతోంది.  అలాగే గడచిన 24 గంటల్లో ఈ ఒక్క రాష్ట్రంలోనే  కొత్తగా 1,000కిపైగా పాజిటివ్ కేసులు నమోదు కావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.  రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 24,427కి చేరింది. దేశంలో న‌మోదైన మొత్తం కేసుల్లో దాదాపు 40శాతానికి పైగా ఈ రాష్ట్రానివే కావ‌డం  గ‌మ‌నార్హం.

 

  పుణె జిల్లా మూడు వేల మార్క్‌ని దాటేసింది. తమిళనాడులోనూ గడచిన 24 గంటల్లో కొత్తగా 716 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. ఒక్క చెన్నైలోనే 500 కేసులు రాగా.. తమిళనాడులో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,718కి చేరింది. గుజ‌రాత్‌లో కొత్త కేసుల సంఖ్య అధికంగా ఉండ‌టంతోపాటు మ‌ర‌ణాల సంఖ్య అధికంగా ఉండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. రాజ‌స్థాన్‌లోనూ దాదాపు ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో గ‌డిచిన వారం రోజులుగా క‌రోనా కొత్త కేసుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతోంది. వ‌ల‌స కార్మికులు స్వ‌రాష్ట్రానికి చేరుకుంట‌డంతో కేసుల సంఖ్య పెరుగుతున్న‌ట్లుగా తెలుస్తోంది. క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ‌ కేసుల్లో అత్య‌ధికంగా వీరివే కావ‌డం గ‌మ‌నార్హం.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: