1. పచ్చి అరటికాయను ఎండబెట్టి పొడిచేసి ఉప్పుతో 1 నుంచి 2 గ్రాముల పొడిని కలిపి సేవించిన అజీర్ణం తొగలగిపోవును.
2. బెల్లముతో శొంటిపొడి కలిపి భోజనమునకు ముందు తినుచున్న అజీర్ణము పోవును.
3. ఉప్పునీళ్లు త్రాగిన అజీర్ణం పోవును.
4. కరక్కాయల పొడి బెల్లం కలిపి సేవించచున్న అజీర్ణము నశించును.
5. అల్లం, జీలకర్ర సైంధవలవణము నిమ్మరసంలో ఊరవేసి ప్రతిరోజు ఉదయం సేవించిన అజీర్ణము తొలగిపోవును.
6. మర్రిచెక్క పొడిచేసిగాని కషాయం పెట్టిగాని సేవించిన అజీర్ణము పోవును.
7. సైంధవ లవణము అల్లము సమానంగా కలుపుకొని ఉదయం, సాయంత్రం 3 గ్రాములు భోజనములందు సేవించిన అన్నిరకముల అజీర్ణరోగములు నశించును.

మరింత సమాచారం తెలుసుకోండి: