ఆరోగ్యంగా ఉన్నప్పుడే కొంచం పని ఒత్తిడి పడితే తలనొప్పి వస్తుంది. ఆలాంటిది మైగ్రరేన్ తలనొప్పి రోజూ బాధిస్తుంటే ఒక ఏ పనీ చేసుకోలేం. ముఖ్యంగా డ్రైవర్ వృత్తి చేసే వారు మైగ్రేన్తో బాధపడుతున్నట్లయితే వారి బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు నొప్పి తీవ్రంగా ఉంటుంది. తలనొప్పి ఒకవైపే ఉంటుంది. ఏదైనా పనిచేస్తున్నప్పుడు తలనొప్పి మరింత తీవ్రమవుతుంది. తీవ్రమైన తలనొప్పి వల్ల ఏ పనీ చేసుకోలేకపోతాను. వికారం, వాంతి వచ్చినట్టుగా అనిపిస్తుంది. వెలుతురు చూడలేకపోవడం. శబ్దాలు వినలేకపోవడం. ఆయన చెప్పిన లక్షణాలన్నీ ఈ విధంగా ఉంటాయి. మైగ్రేన్ సమస్యకు ఇతర చికిత్సా విధానాల్లో పరిష్కారం లేదనే చెప్పవచ్చు. ఇతర చికిత్సల్లో లక్షణాలు తగ్గించేందుకు చికిత్స ఇస్తారే తప్ప మూలకారణాన్ని తొలగించేలా చికిత్స ఉండదు. కానీ హోమియోలో మూలకారణాన్ని తొలగిస్తుంది అని శస్త్ర చికిత్సలు చెబుతున్నాయి. మైగ్రేన్కు కారణమవుతున్న నరాలను సాధారణ స్థితికి తీసుకువస్తుంది. కెమికల్స్ విడుదలను అడ్డుకుంటుంది. ఫలితంగా మైగ్రేన్ సమస్య శాశ్వతంగా తగ్గిపోతుంది. సమస్య మళ్లీ పునరావృతం కావడం అంటూ ఉండదు. ఈ చికిత్సలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం ముఖ్యం.
తల చుట్టూ వుండే కండరాలూ, రక్తనాళాలూ, నరాలూ, కపాలంలో వుండే ఎముకల పై పొరా ,బ్రెయిన్ ని చుట్టుకుని వుండే "మెనింజెస్ "అనే పొరలూ,ఇవన్నీ నొప్పిని తెలియజేసే రిసెప్టార్స్ ని కలిగి వుంటాయి.
మరీ ముఖ్యంగా మెదడు అడుగు భాగం ఈ నొప్పికి తీవ్రంగా స్పందిస్తుంది. విచిత్రంగా మెదడులో పెయిన్ రిసెప్టార్స్ లేని కారణం వల్ల,మెదడుకి దెబ్బతగిలినా,కోసినా కూడా నొప్పి తెలియదు.
వాపు కారణం గానో ,కణుతుల కారణంగానో అది వ్యాకోచించి ఒత్తిడి పెరిగినపుడు మాత్రమే నొప్పి తెలుస్తుంది.
తల నొప్పి ఎలా వస్తుందంటే, యేదయినా దెబ్బ తగిలినపుడు పెయిన్ రిసెప్టార్స్ స్పందించి,అక్కడున్న నాడీ కణాలలో తీవ్రమయిన స్పందనలని కలగ జేస్తాయి, ఇవి మెదడు పొరలలోనూ,రక్తనాళాలలోనూ,వాపుని కలగ జేస్తాయి. రక్తనాళాలు వ్యాకోచిస్తాయి కూడా .ఈ కార్యక్రమమంతా నొప్పిని మెదడుకు తెలియ జేస్తుంది. కొన్ని రకాల మందులు ఈ సిరటోనిన్ ని బ్లాక్ చేయడం ద్వారా తలనొప్పిని తగ్గిస్తాయి.