ఖాకీలు రక్షణే కాదు ఆపదలో ఉన్నవారిని కూడా రక్షిస్తారు అని నిరూపించారు జమ్మికుంట సీఐ సృజన్ రెడ్డి. వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లె గ్రామానికి చెందిన ఒళ్లాల మల్లయ్య (45), మారేపల్లి రవీందర్(45) అనే ఇద్దరు వ్యక్తులు చేపలు పట్టడానికి స్థానికంగా  ఉన్న చేద బావిలోకి దిగారు. 

దిగిన కొద్దిసేపటి తర్వాత శ్వాస ఆడకపోవడం తో బావిలోనే చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు వెంటనే పోలీసులకు,108 కి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సీఐ సృజన్ రెడ్డి వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అప్పటికే పది మంది గ్రామస్థులు కాపాడుదామని బావిలోకి దిగిన వారికీ కూడా ఊపిరి ఆడక బయటకు వచ్చారు.


బావిలో ఉన్న వారికి ఊపిరి ఆడట్లేదని గమనించిన సీఐ స్వయంగా బావిలోకి దిగి  ఇద్దరి ప్రాణాలను కాపాడారు. సకాలంలో స్పందించి తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బావిలోకి దిగి ఇద్దరి ప్రాణాలను కాపాడిన జమ్మికుంట సీఐ సృజన్ రెడ్డి కి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: