తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆద్యంతం అలరించిన షో..
బిగ్ బాస్ సీజన్ త్రీ. మూడు నెలలపాటు వివాదాలు, సంవాదాలతో ఉత్కంఠ భరితంగా సాగిన షోలో.. ఎవ్వరూ ఊహించని విధంగా రాక్ స్టార్ రాహుల్ సిప్లిగంజ్ కప్ ఎగరేసుకుపోయాడు. చివరి వరకు పోటాపోటీగా సాగిన ఈ షో.. ట్రోఫీ, రూ.50 లక్షల
ప్రైజ్ మనీని గెల్చుకున్నాడు.
అండర్ డాగ్గా బిగ్హౌస్లోకి ఎంటర్ అయిన రాక్స్టార్ రాహుల్.. విజేతగా నిలిచారు. దీంతో టైటిల్ ఫెవెరెట్గా హౌస్లో సందడి చేసిన పటాకా
శ్రీముఖి రన్నరప్తో సరిపెట్టుకుంది. మెగాస్టార్
చిరంజీవి చేతుల మీదుగా రూ.50లక్షల నగదు బహుమతిని, బిగ్బాస్ ట్రోఫిని రాహుల్ అందుకున్నాడు. జులై 21న ప్రారంభమైన బిగ్బాస్ సీజన్-3.. 15 వారాల పాటు ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. యాంకర్, నటి
శ్రీముఖి చివరి వరకు రాహుల్కు గట్టి పోటీ ఇచ్చింది.
బిగ్ బాస్ త్రీలో తనను విజేతగా నిలిపిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు
రాహుల్ ధన్యవాదాలు తెలిపారు. ఈ షోలో రాహుల్, నటి పునర్నవి ఒకర్నొకరు ఇష్టపడ్డట్లు ప్రచారం జరిగింది. ఈ వార్తలపై ఇప్పటికే స్పందించిన పునర్నవి.. రాహుల్ తనకు కేవలం స్నేహితుడు మాత్రమేనని చెప్పింది. పునర్నవికి, తనకు మధ్య ఎలాంటి రొమాంటిక్ రిలేషన్షిప్ లేదన్నాడు రాహుల్. పునర్నవి అంటే నాకు గౌరవం ఉంది. మేమిద్దరం మంచి స్నేహితులమని చెప్పాడు.
బిగ్ బాస్ షోలో పాల్గొనడం వల్ల చాలా నేర్చుకున్నానన్నాడు రాహుల్. ఇతరులతో ఎలా ప్రవర్తించాలి, ఎంత సహనంగా ఉండాలనే విషయాలు అర్థమయ్యాయని వివరించాడు. గెలుచుకున్న రూ.50 లక్షలతో తన తల్లిదండ్రుల కోసం మంచి ఫ్లాట్ కొంటానన్నాడు రాహుల్.